సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అయితే ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీలు లాభాలనుంచి స్వల్పంగా వెనక్కి తగ్గి 90 పాయింట్ల లాభంతో 36,408 వద్ద సెన్సెక్స్ , 21 పాయింట్ల లాభంతో 10911 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి. ఇండియాబుల్స్, భారతి ఇన్ఫ్రాటెల్, పవర్గ్రిడ్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ , పవర్గ్రిడ్,టీసీఎస్, ఆర్ఐఎల్ లాభపడుతుండగా, ఎస్బ్యాంక్, హెచ్యూఎల్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, హిందాల్కో, టెక్ మహీంద్ర, అల్ట్రా టెక్ సిమెంట్ నష్టపోతున్నాయి.
అటు దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్గా మొదలైంది. బుధవారం నాటి ముగింపు 71.24తో పోలిస్తే డాలరుమారకంలో 71.15 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది.